కామారెడ్డి, ఫిబ్రవరి 7 : కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మున్సిపల్లో జరిగిన అక్రమాలపై గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ కౌన్సిలర్లతో కలిసి ఆందోళన చేపట్టారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించి ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో బుధవారం విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, రికార్డులను తీసుకొని పంచనామాకు వెళ్లారు.దీనిపై మున్సిపల్ కమిషనర్ దేవేందర్ను వివరణ కోరగా గతంలో విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించారని, వాటిని తిరిగి పరిశీలించడానికి వచ్చారని తెలిపారు