వేల్పూర్, మార్చి 30 : కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆశ వర్కర్లకు ప్రభు త్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను బుధవారం పంపిణీ చేశారు. వారి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య సిబ్బందికి ఫోన్లు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, మండల వైద్యాధికారి అశోక్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.