ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో యువకులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత డీజే చప్పుళ్ల మధ్య బైక్ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదానాలు చేశారు.