ఖలీల్వాడి, సెప్టెంబర్ 23 : అభివృద్ధికి చిరునామాగా నిజామాబాద్ నగరం నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. 19వ డివిజన్ గంగస్థాన్-1లో రూ. కోటీ 50 లక్షలు, 42వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. కోటీ 50లక్షలు, 50వ డివిజన్ శివాజీనగర్లో రూ. కోటితో రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల కాలంలో నిజామాబాద్ రూపురేఖలు మార్చామని తెలిపారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. తాగునీటి కోసం ప్రత్యేక ఫీడర్ నిర్మించి ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఖాళీ స్థలాల్లో పార్కులు నిర్మించి ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నగర ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా ప్రతి డివిజన్కు కోటి రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించినట్లు తెలిపారు.అభివృద్ధిని చూసి మంత్రి కేటీఆర్ కితాబునిస్తూ మళ్లీ ప్రతి డివిజన్కు కోటి రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. మంజూరైన నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు ఏలేటి సిద్ధార్, వెల్డింగ్ నారాయణ, బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధ, బీఆర్ఎస్ నాయకులు జగత్రెడ్డి, గంగామణి, శంకర్, రాజేందర్, మీసాల శ్రీనివాస్, సింగిరెడ్డి శ్రీనివాస్, దీల్లోడ్ ఆకాశ్ బట్టు, రాఘవేందర్, సదానంద్, నరేందర్, సంజయ్ పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ జనరంజక పాలన చూసి ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, దండు శేఖర్, సూదం రవిచందర్, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్, సభ్యులు సంజీవ్గౌడ్, నర్సింహులు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.