ఖలీల్వాడి, ఏప్రిల్ 20 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్లో లోక కల్యాణార్థం శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అయుత చండీయాగం కొనసాగుతున్నది. గురువారం ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయుత చండీ అతిరుద్రం – పూర్ణాహుతి కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షానికి యాగశాలలోని పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.