వినాయక్నగర్, మార్చి 5: నగరంలోని తిలక్గార్డెన్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న వేంకటేశ్వర మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి యజమానులు మొబైల్ షాపును మూసివేసి వెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా సెల్ఫోన్స్, మిగతా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడానికి గమనించగా షాపు వెనకాల ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి దుండగులు లోనికి దూరినట్లు గుర్తించారు. వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
దుండగులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుం డా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. యజమాని ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు లక్షల విలువజేసే మొబైల్స్ చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఇది లా ఉండగా సీపీ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే చోరీ జరగడం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు.. కేసును ఛేదించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.