డిచ్పల్లి, మార్చి 8: ఇందల్వాయి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి వన నర్సరీకి ఎదురుగా ఉన్న అడవికి గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతైంది.
పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి