Kotagiri | కోటగిరి, జూన్ 28 : పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడడంతో రెండు గేదెలు మృతి చెందినట్లు బాధితుడు చిక్లే ప్రకాష్ రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం టాక్లి గ్రామంలో చిక్లే ప్రకాష్ రావు ఇంటి సమీపంలో అతనికి చెందిన రెండు గేదెలు కట్టేసి ఉన్నాయి.
సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో రెండు గేదెలు అక్కడిక్కడే మృతి చెందాయని బాధితుడు వాపోయాడు. రెండు గేదెలు కూడా నిండు చూడి ఉన్నాయని ఒక్కో గేదె ధర రూ.90వేలకు పైగా ఉంటుందనీ సుమారు రెండు గేదెలు కలిపి రూ.2 లక్షలు ఉంటుందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగుపాటుకు జరిగిన నష్టంకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.