నిజామాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల సెగ తగిలింది. ఎంపీ అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని నందిపేట్ మండలంలో ఎంపీ అరవింద్ పర్యటిస్తుండగా ఆయనకు పసుపు రైతుల సెగ తగిలింది. ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పసుపు రైతులు రోడ్డెక్కారు. అరవింద్కు వ్యతిరేకంగా గ్రామాల్లో పసుపు రైతులు మోహరించారు. అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ చూపిస్తూ పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. రైతుల నిరసనతో ఎంపీ అరవింద్ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయినట్టు రైతులు తెలిపారు.