నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 20 : పాల ఉత్పత్తులతోపాటు ఆహార ధాన్యాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పేదలపై పన్నుల భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంతోపాటు కమ్మర్పల్లి, నందిపేట్, దోమకొండ, జుక్కల్ మండల కేంద్రాల్లో నిరసనలు కొనసాగాయి. లింగంపేట్లో నిర్వహించిన ధర్నాలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.