కామారెడ్డి/ఆర్మూర్టౌన్/ ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 13: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చే పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామా బాద్ జిల్లాకు చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ సంగారెడ్డి మున్సిపల్కు బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో మర్రిపెడ నుంచి ఎ.రాజు బదిలీపై వస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ను మెదక్ జిల్లా రామాయంపేటకు, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జీవన్ను నారాయణ్ ఖేడ్కు బదిలీచేశారు. కాగా కామారెడ్డి, ఎల్లా రెడ్డి మున్సిపల్ కమిషనర్లుగా ఇంకా ఎవరినీ నియమించలేదు.