చారిత్రక కట్టడాల్లో భాగమైన మెట్ల బావులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏండ్ల నాటి ఈ బావుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి కనుమరుగవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దరాంమందిర్లో నాలుగైదు శతాబ్దాల నాటి మెట్ల బావి ఉన్నది. పునరుద్ధరణ పనులు చేపట్టి మెట్ల బావికి పూర్వవైభవం తీసుకొస్తే పర్యాటక ప్రాంతంగా మారుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మెట్లబావిని బాగుచేయాలని కోరుతున్నారు.