ఆటోలను నమ్ముకున్న బతుకులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమకు ఉపాధి లేకుండా పోతున్నదని ఆటోడ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. గురువారం పలుచోట్ల ఆటోలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉచిత ప్రయాణం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.