వేల్పూర్, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ బాలగంగాధర్ అనుచరులు, బీజేపీ నుంచి వడ్ల సంఘం అధ్యక్షుడు ముప్పారం శ్రీధర్ అనుచరులు, కాంగ్రెస్ భీమ్గల్ మండల జనరల్ సెక్రటరీ, బాబాపూర్ 9వ వార్డు మెంబర్ ఎండీ హఫీజ్, బాల్కొండ ఏబీ నగర్ నుంచి లయన్స్ యూత్, ఏబీ బాయ్స్ యూత్ సభ్యులు, మోర్తాడ్ మండలం పాలెం గ్రామం నుంచి బుల్స్ యూత్ యంగ్ బ్రదర్స్ యూత్, యువ మాదిగ సేన యూత్ సభ్యులు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, యువకులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
ఆర్మూర్, అక్టోబర్30: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసానికి వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు భారీ సంఖ్యలో వచ్చి జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. సోమవారం ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన వంశీ, రాజు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమని ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ కండువాను బలవంతంగా వేసినట్లు తెలుపుతు జీవన్రెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శృంగారం ప్రవీణ్, నవీన్, రమేశ్, మురళీ, నందిపేట మండలం వన్నేల్(కే) , సిద్దాపూర్ గ్రామానికి చెందిన యువకులు జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నందిపేట్, అక్టోబర్ 30: డోంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణీ మురళి దంపతులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన ఎంపీటీసీ దంపతులు తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చారు. జీవన్రెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంతోష్రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, లోక హన్మాండ్లు, మహేందర్, సుక్కి సుధాకర్ పాల్గొన్నారు.
బోధన్, అక్టోబర్ 30: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సమక్షంలో సాలూర, బోధన్ మండలాలకు చెందిన వివిధ గ్రామాల కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కులసంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరారు. సాలూర మండల కేంద్రంలో ఆ మండలం బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం వీరంతా బీఆర్ఎస్లో చేరారు. వీరికి మహ్మద్ షకీల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరినవారిలో సాలూర మండలంలోని సాలూర, తగ్గెల్లి, కుమ్మన్పల్లి, సిద్దాపూర్ గ్రామాలు, బోధన్ మండలం హంగర్గా, కొప్పర్గ గ్రామాలకు చెందినవారు ఉన్నారు.