కోటగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జల్లాపల్లిఫారంలో జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్పీకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆలయ ప్రహారి నిర్మాణానికి రూ.12లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం కొత్తపల్లి సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ శంకర్పటేల్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు హెచ్ స్వరూప, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్పటేల్, ఎంపీటీసీ రాములు, మండల కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.