ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం గిరిజనోత్సవ కార్యక్రమాన్ని తండాల్లో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవాలకు పూజలు చేశారు. కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, జాజాల సురేందర్, ఆశన్నగారి జీవన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.