కంఠేశ్వర్, ఏప్రిల్ 19: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్ వేయగా.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, బహుజన ముక్తిపార్టీ అభ్యర్థి దేవతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థులుగా రాపెల్లి శ్రీనివాస్ , రాగి అనిల్, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెలా సుమన్ నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు