నిజామాబాద్ : జీవితాంతం కష్ట,సుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి పెండ్లి చేసుకున్న భర్త వికృత చర్యలకు పాల్పడ్డాడు. తన భార్యను వదిలించుకోవడానికి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..గంగా సాగర్, స్రవంతి ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.
వీరు ఆర్మూర్లో నివాసముంటున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. వీరికి నాలుగేండ్ల బాబు కూడా ఉన్నాడు. కాగా, స్రవంతిని ఎలాగైనా వదిలించుకోవాలని గంగా సాగర్ నిర్ణయించుకున్నాడు.
అందుకోసం స్కిన్ అలర్జీ కోసం ట్రీట్మెంట్ అని చెప్పి స్రవంతికి గంగాసాగర్ స్టెరాయిడ్స్ ఇచ్చాడు. అనుమానం వచ్చి దవాఖానలో చూపించుకోగా స్రవంతికి అసలు విషయం తెలిసింది.
దీంతో 25 ఏడ్లకే స్రవంతి నరాల బలహీనతకు గురైంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని స్రవంతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితురాలు కలెక్టరేట్కు వచ్చారు.