ఖలీల్వాడి, డిసెంబర్ 29 : భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ నేడు దేశవ్యాప్త పిలుపులో భాగంగా సమాఖ్యవాద పరిరక్షణ దినం (డిఫెండ్ ఫెడరలిజం డే) కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ.. బీజేపీయేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరీకరణ చేస్తున్న దని, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని మండి పడ్డారు.
కేరళ, తమిళనాడు, తెలంగాణతో పాటు ఇంకా అనేక రాష్ర్టాల్లో ఫెడరిజం రక్షణ-గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం అనేక ఉద్యమాలు జరిగాయని అన్నారు. ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యయుతంగా పాలన చేసుకోనివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, కె.రాజన్న, దక్షిణ మండల కార్యదర్శి పి.రంజిత్, నాయకులు బొంబాయి గంగారాం, ఎండీ రఫీక్ఖాన్, కె.యాదగిరి, హన్మాండ్లు, రఘురాం, అంజలి, రమేశ్, శ్రీను, వంశీ, గంగాసాగర్, గంగాధర్, నాగం సాయిలు పాల్గొన్నారు.