డిచ్పల్లి, ఫిబ్రవరి 22 : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి నిజామాబాద్కు కారులో విజయలక్ష్మి (38), ఆమె సోదరుడు సాంబశివరావు, అల్లుడు గోపాలకృష్ణ బయల్దేరారు. వీరి కారు డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామం వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, సాంబశివరావు, గోపాలకృష్ణలకు గాయాలయ్యాయి. కారును అతివేగంగా నిద్రమత్తులో నడపడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్లో ఉంటున్న సాంబశివరావు భార్యను తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.