ఇందల్వాయి, ఏప్రిల్ 4: ఇందల్వాయి మండలం డొంకల్ గ్రామపరిధిలోని డొంకల్ తండాలో రామావత్ అఖిల్ అనే ఐదేండ్ల బాలుడు వడదెబ్బతో మృ తి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం పాఠశాలకు వెళ్లిన అఖిల్ మధ్యాహ్నం తర్వాత ఇంటి సమీపంలో ఆడుకుంటూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు పల్స్ పూర్తిగా పడిపోవడంతో వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారన్నారు. మృతుడి తల్లి అనిత వ్యవసాయ కూలీ కాగా, తండ్రి రమేశ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.