నస్రుల్లాబాద్, జనవరి 19: ఆవు తోకను పట్టుకొని చెరువులోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సోము శ్రీనివాస్ (16) కొన్నేండ్లుగా పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు.
శుక్రవారం గ్రామ సమీపంలోని పెద్ద చెరువులోకి ఆవు తోకను పట్టుకొని దిగాడు. చెరువు మధ్యలోకి వెళ్లాక తోకను వదిలేయడంతో ఈత రాక నీట మునిగి మృతిచెందిన ట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ దవాఖానకు తరలించినట్లు ఆయన తెలిపారు.