ప్రాణాలకు తెగించి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే సునామిలా అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తున్నది. 50 ఏండ్లపాటు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదు. అన్నీ కష్టాలు, కన్నీళ్లే. బీఆర్ఎస్ హయాంలో మన రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నది. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ ఆగ్రనేతలంతా తెలంగాణపై పడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. అభివృద్ధిని అడ్డుకోలేరు. సీఎం కేసీఆర్ను ఢీకొట్టే మొనగాడే లేడు. మా ఉద్యమ నాయకుడే హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా.. అని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సుజీత్సింగ్ ఠాకూర్ అన్నారు. ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గతంలో నిజామాబాద్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన డీ శ్రీనివాస్, యెండల ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 2014 వరకు నగర ప్రజలు నిత్యం అనేక కష్టాలు ఎదుర్కొని కాంగ్రెస్, బీజేపీతో విసిగిపోయారు. అందుకే బీఆర్ఎస్కు పట్టం కట్టి ఎమ్మెల్యేగా బిగాల గణేశ్గుప్తాను ఎన్నుకున్నారు. రెండుసార్లు భారీ మెజారిటీతో గెలిపించారు. బిగాల కూడా ప్రజల రుణం తీర్చుకునేలా నగరాన్ని రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఇంద్రధనస్సులా తీర్చిదిద్దారు. ఇందూరు నగరం నలువైపులా విశాలమైన రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పచ్చని మొక్కలతో నేడు సుందరంగా మారింది. ఐటీ హబ్, ఆర్యూబీ, ఆధునిక వైకుంఠధామాలు, పార్కులు, మినీ ట్యాంక్బండ్ను ఏర్పాటు చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు తదితర అన్ని మౌలిక సౌకర్యాలూ సమకూర్చారు. కొత్త కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలను కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బిగాల గణేశ్గుప్తా చేసిన అభివృద్ధి మన కండ్లెదుటే ఉన్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. దోచుకోవడం, దాచుకోవడం తప్పా అభివృద్ధి శూన్యం. ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ తొమ్మిదేండ్లలోనే సునామిలా అభివృద్ధి సాధించింది. ఎవరూ ఊహించని విధంగా దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. కేసీఆర్ను వెనక్కి నెట్టాలనే దుర్బుద్ధితో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలంతా ఇక్కడికి వచ్చి ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎంతమంది అడ్డుకోవాలని చూసినా తెలంగాణ అభివృద్ధి మాత్రం ఆగడంలేదు. కేసీఆర్ను ఢీకొట్టే మొనగాడు ఉన్నడా? బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం పక్కా.
కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆయన పిలుపు మేరకు దీక్షలు చేశాం. అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ముఖర్జీ నిజామాబాద్కు వచ్చినప్పుడు ఉద్యమకారులు అడ్డుకుంటే పోలీసులు తీసుకుపోయి కొట్టారు. ఆ సమయంలోనే ఉద్యమ నేత.. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ దొంగలకు ఎలా అప్పగిఇస్తాం. రాష్ర్టాన్ని దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టే హామీలిస్తున్నది. కర్ణాటకలో ఒక్క హామీనైనా అమలు చేసిందా? ప్రజలు ఆలోచించాలి.
తెలంగాణలో ఏం ఉంది. కాంగ్రెస్, బీజేపీ పెద్ద నాయకులంతా ఎందుకు వస్తున్నారు? ఇతర రాష్ర్టాలకు ఎందుకు వెళ్లడంలేదు? ఎందుకుంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది. సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిని ఎలాగైనా ఆపాలనే కుట్రతో ఇక్కడికి వస్తున్నారు. ఓటుకు నోటు దొంగ.. రేవంత్రెడ్డి కూడా సీఎంను విమర్శించడం విడ్డూరం. కేసీఆర్ శ్వాస తగిలినా రేవంత్ జన్మ ధన్యమైతది.
సీఎం కేసీఆర్ను ఢీకొట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు. ఆయన ప్రజల నాయకుడు. చిన్న, పెద్ద, ముసలి, ముతక ఇలా అందరి బాగు కోసం ఆలోచిస్తారు. మనం ఊహించని ఎన్నో పథకాలు తెచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆత్మగౌరవంతో నిలబెట్టారు. అందుకే ప్రజల గుండెల్లో నిలిచారు. రేవంత్రెడ్డి ఓ బచ్చాగాడు. ప్రజలకు కూడా తెలుసు తెలంగాణను అమ్మేస్తాడని. ఇక కేసీఆర్ను ఢీకొట్టి గెలుస్తాడా?
బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు విద్వేషాలను రెచ్చగొడుతూ లబ్ధిపొందాలని చూస్తారు. శాతాబ్దాలుగా దేశంలో అనేక మతాలు, కులాలు ఉన్నాయి. ప్రజలు కలిసి ఉండాలనుకుంటే.. కమలం పార్టీ చిచ్చు పెడుతుంది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అణిచివేతలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మనం చూడలేదా? మరి ఇప్పుడు.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నది. అందరినీ ఆదరిస్తున్నది. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నది. దళిత, బీసీ, అగ్రవర్ణాలు అనే తేడా లేకుండా పథకాలు అందజేస్తున్నది. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారు.
ఎవరితోనూ సాధ్యం కాని ప్రత్యేక తెలంగాణను సాధించి.. కేసీఆర్ ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి ప్రజల కలలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్నారు. పదేండ్లలో రాష్ట్ర సంపదను పెంచి సాగునీరు, ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఇదే వేగంతో ప్రగతి కొనసాగేందుకు రాష్ట్ర ప్రజలందరూ మరోసారి బీఆర్ఎస్వైపే నిలబడ్డారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టిస్తారు.