తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయం, పోలీసు శాఖలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టం చేశారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మన పోలీసు వ్యవస్థ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. నిజామాబాద్లో ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జీవన్రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పాల్గొన్నారు.
– ఖలీల్వాడి/నిజామాబాద్ క్రైం/ కామారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ)
నిజామాబాద్ క్రైం/ ఖలీల్వాడి, జూన్ 4 : కేసీఆర్ ప్రభుత్వం ప్రజారక్షణకు ప్రా ధాన్యం ఇస్తున్నదని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సురక్షా దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు డీసీసీ మధుసూదన్రావు హాజరయ్యారు. పెట్రో కార్లు, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ మాట్లాడారు. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ ప్రభుత్వం పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు. పోలీస్స్టేషన్ అంటే భయం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
పోలీసు సిబ్బందికి బైక్లు అందజేసి పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. హోంగార్డుల సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ జీతాలను పెంచారని తెలిపారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కేడీలకు బేడీలు వేస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నా రు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రపంచంలో మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను హైదరాబాద్లో ఏ ర్పాటు చేశారని అన్నారు. మహిళల రక్షణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నా రు. రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థుల రక్షణ కోసం 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. కొవిడ్ సం క్షోభం సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో మన పోలీసులు దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అడిషనల్ డీసీపీ మధుసూదన్, ఏసీపీ కిరణ్కుమార్, పోలీసు అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.