రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో స్పీకర్ పోచారంతోపాటు రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కారు బడుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. పలుచోట్ల అదనపు తరగతి గదులతోపాటు విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్బుక్స్ను అందజేసి విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని వివరించారు.