నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. బాల్కొండ, ఎడపల్లి, భీమ్గల్,మోర్తాడ్, వేల్పూర్, నందిపేట్, ఆర్మూర్, బోధన్, మాక్లూర్, రెంజల్, బోధన్ రూరల్ తదితర మండలాల్లో ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. వినాయక్నగర్లోని ఐలమ్మ విగ్రహానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. దొరల ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచి సమసమాజ స్థాపనకు కృషి చేసిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, కరిపె రవీందర్, నారాయణరావు (నాని), చంద్రమోహన్, బస్వరాజ్, రమేశ్, భూమేశ్ పాల్గొన్నారు. నగరంలోని 100 ఫీట్ల రోడ్డు వద్ద ఐలమ్మ విగ్రహానికి రజక ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మానస గణేశ్, రజక సంఘం సభ్యులు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటగిరి, ఎత్తొండ, ఇందల్వాయిలో రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్పల్లిలో రజక సంఘం సభ్యులు, డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలో సర్పంచ్ గడ్డం రాధాకృష్ణరెడ్డి, ఉపసర్పంచ్ ఆసది రవీందర్, వార్డుమెంబర్ తోట గంగాధర్, రజక సంఘం సభ్యులు, రజక ఐలమ్మ యూత్ అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించారు. ఆర్మూర్ దోభీఘాట్లోని ఐలమ్మ విగ్రహానికి రజక ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సాలూరాలో చాకలి ఐలమ్మ విగ్రహానికి వద్ద బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ పూలమాలలు వేసి నివాలులు అర్పించారు.
డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న న్యూ బాయ్స్ హాస్టల్లో ఎన్ఎస్యూఐ – టీయూ కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. జక్రాన్పల్లిలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ – మండల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. మండల ఎడ్యుకేషన్ చైర్మన్ కొప్పు రాజేందర్, జిల్లా వైస్చైర్మన్ సుర్భిర్యాల ప్రసాద్, రూరల్ చైర్మన్ దత్తుగౌడ్ తదితరులు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్లో కొండూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొండూర్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు తొర్లికొండ రాజు, రజక ఐక్యవేదిక జిల్లా జనరల్ సెక్రటరీ బండి నరేశ్, రజక సంఘం సభ్యులు గంగాధర్, రాము, వినయ్, అఖిల్, గంగాధర్ పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఎడపల్లిలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్లోని రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జయరాం, వీరాపురం సాయిలు, నరేందర్, బాబి, వార్డు సభ్యులు స్వప్న, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.