నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. కులసంఘాలు, వివిధ వర్గాల ప్రజలు స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బాన్సువాడ, నవంబర్ 13 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. పోచారాన్ని కోటగిరి, పోతంగల్ మండలాల్లోనిఎమ్మార్పీఎస్ సభ్యులు, బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎల్లమ్మ కాలనీకి చెందిన అంబేద్కర్ సంఘం సభ్యులు, కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన మాల కులస్తులు, ఆయా సంఘాల సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల సభ్యులు స్పీకర్ పోచారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మేమంతా పోచారం వెంటే ఉంటామని, ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఓట్లు వేస్తామని తీర్మాన పత్రాలను పోచారానికి అందజేశారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాన్సువాడలో పొతంగల్ మండలంలోని హంగర్గ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ నాయకులు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన హంగర్గ గ్రామ బీజేపీ నాయకులకు గులాబీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. బీఆర్ఎస్లో చేరినవారిలో హంగర్గ నాయకులు సంతోష్, జీవన్, లాలాబోయి, బాబురావు, వీరేశం, సురేశ్, రాజుకుమార్తోపాటు అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, సీనియర్ నాయకులు వల్లెపల్లి శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు. బాన్సువాడ మండలం దేశాయిపేట్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, గ్రామ వార్డు సభ్యుడు విఠల్ పటేల్, డీజే రాజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.