Bansuwada | బాన్సువాడ రూరల్, జూన్ 8 : విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని జక్కలదాని తండా, బుడిమి గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బడీడు పిల్లలను గుర్తించారు.
విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను భరించారు. ఉపాధ్యాయులు చంద్రకాంత్, హీరా లాల్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.