గాంధారి/ సదాశివనగర్, ఏప్రిల్ 2: కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి, సదాశివనగర్ మండలాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధారి మండల కేంద్రంలోని గుండమ్మ కాలువ బైపాస్ రోడ్డులో రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పద్మాజీవాడి ఎక్స్రోడ్డు నుంచి మొండిసడాక్ వరకు రూ. 21 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి ఎక్స్రోడ్డులో ఉప్పల్వాయి నుంచి బాన్సువాడ వరకు రూ. 7.23 కోట్లతో చేపట్టనున్న రహదారి పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని తెలిపారు. అభివృద్ధి ఉన్న చోటనే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ తలసరి ఆదాయం రూ. మూడు లక్షలని తెలిపారు. రైతులు, పేదల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని దేశం మొత్తం గుర్తిస్తుంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల కండ్లకు మాత్రం అభివృద్ధి కనిపించడం లేదన్నారు. బండి సంజయ్, రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. గతంలో బాన్సువాడ నుంచి ఉప్పల్వాయి వరకు ఉన్న రహదారి పనుల్లో పూర్తికాని పనుల కోసం నిధులు మంజూరు చేసి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు. రహదారి పునరుద్ధరణ పనుల కోసం నిధులు మంజూ రు చేసి పనులను ప్రారంభించిన మంత్రి వేములకు ఎమ్మెల్యే సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
గాంధారిలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు,డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీరావు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణరావు, గాంధారి సర్పంచ్ సంజీవ్, గాంధారి, ముదెల్లి విండో చైర్మన్లు సాయికుమార్, సాయిరాం, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డిరాజు, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, విండో డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, గండివేట్ సర్పంచ్ అబ్దుల్ ఫారూక్, బీఆర్ఎస్ మండల నాయకులు ముకుంద్రావు, పెద్దబూరీ సత్యం, శ్రీనివాస్, బెజుగం సంతోష్, శ్రీకాంత్రెడ్డి, తాన్సింగ్ తదితరులు ఉన్నారు.
సదాశివనగర్ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ పాటిల్, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సర్పంచ్ కవితా ఆనంద్, ఎంపీటీసీ సుజాత, ఉప సర్పంచ్ రజివోద్దీన్,మండల కో- ఆప్షన్ సభ్యుడు అల్తాప్, జిల్లా కో- ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్, విండో చైర్మన్ గంగాధర్, రైతు బంధు సమితి కన్వీనర్ భూంరెడ్డి, నాయకులు శ్రీనివాస్ నాయక్, గాదారి ఆశోక్ రెడ్డి, తీగల నాగాగౌడ్, వడ్ల రాజేందర్, రాజేశ్వర్ రావు, కలాలీ సాయాగౌడ్, గడీల భాస్కర్, హైటెక్ బాలయ్య, దస్తగిరి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.