రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు.
గిరిజనులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా గిరిజన నాయకులు పేర్కొన్నారు.