ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28 : ఈనెల 23న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. పరీక్ష ముగిసిన అనంతరం బయటికి రాగానే విద్యార్థులు ఆనందంతో ఎగిరి గంతులేశారు.
హాస్టళ్లలో ఉండి చదువుకున్న విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. విద్యార్థులతో బస్టాండ్లు కిటకిటలాడాయి.