మెండోరా, డిసెంబర్ 25 : నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం ఎస్సారెస్పీ నుంచి ఆదివారం నీటిని విడుదల చేశామని ఏఈఈ మాధురి తెలిపారు. కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న 5 ఎస్కేప్ గేట్ల ద్వారా దిగువకు 500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని చెప్పారు.
ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 5500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 150, సరస్వతీ కాలువకు 600, వరదకాలువకు 2వేలు, అలీసాగర్కు 150, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు. మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం 150 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1090.30 అడుగుల (86.461 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నదన్నారు.