మెండోరా : మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో తగ్గి పోవడంతో ఎత్తిన 6 వరద గేట్లను
గురువారం ఉదయం 8 గంటలకు మూసివేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 9,180 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందన్నారు. ఎస్కేప్ గేట్లనుంచి గోదావరిలోకి 5,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 600, లక్ష్మి కాలువకు 80, సరస్వతీ కాలువకు 800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు).
కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు( 89.763 టీఎంసీలు)నీటి నిల్వ ఉందన్నారు. ప్రస్తుత సంవత్సరం ఎగవ నుంచి ఎస్సారెస్పీలోకి 300.814 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు. అయితే కాలువకు , మిగులు జలాలు గోదావరిలోకి ఈ సీజనులో దిగువకు 229.488 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు.