Kotagiri | కోటగిరి, ఏప్రిల్ 26 : ఆర్యవైశ్యులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండగ అయిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండరాజు, పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అహింస ,ఆత్మ అభిమానం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన అమ్మవారిని స్మరిస్తూ వైశ్యులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమార్చనలు కలశ పూజలు నిర్వహించారు. వాసవీ మాతను అధిపారాశక్తి స్వరూపంగా కొలిచారు. ఈ సందర్భంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోల అశ్విన్ కుమార్, మాషెట్టి గణేష్, మహేష్, నరేందర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.