ఉమ్మడి జిల్లాలోని చర్చిలు ముస్తాబయ్యాయి. ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థన మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. చర్చి ఆవరణలో క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్తోపాటు పశువుల పాకను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ను పురస్కరించుకొని నేడు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించనున్నారు.
స్పీకర్ శుభాకాంక్షలు..
బాన్సువాడ, డిసెంబర్ 24 : క్రైస్తవులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు.