Admissions | బాన్సువాడ రూరల్, జూన్ 9 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇందూరు గంగాధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం డిగ్రీలో ప్రవేశాల కోసం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దోస్త్ అప్లికేషన్లో జిల్లాలో ఎస్.ఆర్.ఎన్.కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు.
ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలకై దోస్త్ అప్లికేషన్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పీజీలో ప్రవేశాలపై ప్రవేశ పరీక్ష రాయాలని సూచించారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ తో పాటు ఎన్.సీ.సి ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్.ఆర్.ఎన్.కె డిగ్రీ కళాశాలకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.