బాన్సువాడ, జనవరి 10: రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్లోని షరీఫ్ దర్గాను తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం దర్శించుకొన్నారు. 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసి)లో పాల్గొనడానికి రాజస్తాన్లోని జైపూర్కు వెళ్లారు. అక్కడ అజ్మీర్లోని దర్గా ను దర్శించుకొని చాదర్ను సమర్పించారు.
సభాపతి, శాసనమండలి చైర్మన్ వెంట నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్లు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, కో -ఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్బాబా, పోతుల బొగుడ గోపాల్ రెడ్డి, మహ్మద్ ఎజాస్, జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు పాత బాలకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బుల్లెట్ రాజు, సతీశ్రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.