డిచ్పల్లి, ఆగస్టు 6: ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించడంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం బిల్లు ఆమోదం పొందిన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న బాజిరెడ్డి గోవర్ధన్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంబురాలు చేసుకొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు బాజిరెడ్డి గోవర్ధన్ స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన సందర్భంగా సంస్థ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, మల్లారం సర్పంచ్ రాము, శ్రీనివాస్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు