సారంగాపూర్, జనవరి 23: బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని తెలిపారు. గంగస్థాన్ ఫేస్-2లో ఉన్న తన నివాస ప్రాంగణంలో 72 మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ హామీల అమలుకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం కానుకగా అందిస్తామని చెప్పారు. రైతుబంధు డబ్బులు నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, శేఖర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, పూర్ణచందర్రాజు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.