కామారెడ్డి, అక్టోబర్ 13 : కామారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా సింధూశర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆమెను ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆమె సాయంత్రం విధుల్లో చేరారు.
కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శాసనసభా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ ఎస్పీ శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం సింధూ శర్మను ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింధూశర్మ గతంలో జగిత్యాల ఎస్పీగా పని చేశారు. వరంగల్ జిల్లాలోని మామునూర్ నాల్గో బెటాలియన్ కమాండెంట్గా పని చేస్తూ బదిలీల్లో భాగంగా కామారెడ్డి ఎస్పీగా వచ్చారు. సింధూశర్మ 2014 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి.