ధర్పల్లి, జూలై 5 : ధర్పల్లి మండలం సీతాయిపేట్ గుడితండాలో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గొడ్డూ గోద, పిల్లాజెల్లా క్షేమంగా ఉండాలని, వానలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.