హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్.. హైదరాబాద్ నుంచి మరిన్ని నగరాలకు నూతన సర్వీసులు ప్రారంభించబోతున్నది. సెప్టెంబర్ 1 నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నది. మరోవైపు హైదరాబాద్-చెన్నై మధ్య విమాన సర్వీసును తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్లో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి.. తిరుపతికి 2.40 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరి హైదరాబాద్కు సాయంత్రం 4.30 గంటలకు వస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి ఉదయం 8.05 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు చేరుతుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి 3.10 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.