Peddakodapgal | పెద్ద కొడప్ గల్, జూన్ 16 : విత్తనాలు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టం పరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొడప్గల్ ఏవో కిషన్ విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులకు హెచ్చరించారు. పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని పలు విత్తనాలు ఎరువుల దుకాణాలను మంగళవారం ఆయన పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
దుకాణదారులు విత్తనాలు ఎరువుల వివరాలను ప్రతిరోజు తప్పకుండా రికార్డులో నమోదు చేయాలన్నారు. రైతులకు ఒరిజినల్ రసీదు ఇవ్వాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తయారీ గడువు తేదీ, సీల్, లాట్ నంబర్లు కలిగి ఉన్న విత్తనాలను కొనుగోలు చేయని రైతులకు సూచించారు.