సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనులతో పలు రైలు మార్గాల్లో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం రైల్వే అధికారులు తెలిపారు.
మిరాజ్-పార్లీ, కల్హాపూర్-నాగ్పూర్, కొల్హాపూర్-ధనబాద్ వంటి రైల్వేస్టేషన్ల మధ్యలో ఆరు రైళ్లను రద్దు చేశామన్నారు. ఈ నెల 26 నుంచి జనవరి 5 వరకు టైమ్టేబుల్ వారీగా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే మరో నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని తెలిపారు.