వర్ని, ఏప్రిల్ 6: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. బండ్ నిర్మాణ పనుల్లో మరింత వేగంగా పెంచాలన్నారు. ఎక్కువ యంత్రాలను తెప్పించి రాత్రి, ప గలు చురుగ్గా పనులు సాగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించారు.
ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగంగా చేపట్టడంతోపాటు నాణ్యతలో ఎక్కడా తేడా రాకూడదని సూచించా రు. పనులను నిత్యం పర్యవేక్షిస్తానని అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుంటానని స్పీకర్ స్పష్టం చేశారు. నాయకులు, అధికారులు ఉన్నారు.