బీర్కూర్, మే 28: రాష్ట్రాభివృద్ధిపై అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశమంతా చూస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలకేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు. రూ.7.20 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులు, రూ. 1.10 కోట్లతో బీర్కూర్ నుంచి బీర్కూర్ శివారులో ఉన్న వేంకటేశ్వరాలయానికి సీసీరోడ్డు పనులు, రూ. 10 లక్షలతో చేపట్టనున్న మున్నూరుకాపు సంఘ ప్రహరీ నిర్మాణ పనులకు బీఆర్ఎస్రాష్ట్ర నాయకుడు పో చారం సురేందర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. దేశ్కీ నేత కేసీఆర్ అని అన్నారు. ఇక్కడున్న ప్రతిపక్షపార్టీల రాష్ట్ర అధ్యక్షులకు ఏ ఒక్కరికైనా సీఎం అయ్యేస్థాయి ఉందా అని ప్రశ్నించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే కుట్రలు పన్నాయన్నా రు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఎప్పుడు ఎవరు సీఎం గా ఉంటారో వారికే తెలియదన్నారు.వారు ప్రజల గు రించి ఏం ఆలోచిస్తారని, వారి పదవిని కాపాడుకునేందుకే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు.
బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పతనం కర్ణాటక నుంచి మొదలైందన్నారు. తెలంగాణలో బీజేపీ ప ప్పులు ఉడకవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశమంతా కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా బాన్సువాడ ముందు వరుసలో ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి పనులకైనా నిధులు తీసుకువచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
సాయిబాబా ఆలయ ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలు, కమ్మ సంఘ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. వచ్చే అసెం బ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి తానే పోటీలో ఉంటానని సభాపతి పోచారం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పిలిచి ఈసారి బాన్సువాడ నుంచి తననే పోటీ చేయాలని, సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారని తెలిపారు.
ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ సందీప్, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, కమ్మ సత్యనారాయణ, ఎల్.గంగాధర్, దుంపలరాజు, కొరిమె రఘు, బుడ్డరాజు, మండల కో-ఆప్షన్ మెం బర్ ఆరిఫ్, వైస్ ఎంపీపీ కాశీరాం, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆవారి గంగారాం, కొల్లి గాంధీ, ద్రోణవల్లి అశోక్, యువజన విభాగం అధ్యక్షుడు శశికాంత్, నాయకులు మన్నన్, పోగు నారాయణ, అప్పారావు, రాంబాబు, పుల్లెని బాబూరావు, కృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, నీరడి శ్రీను, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.