సిరికొండ, జనవరి12 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యమిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సిరికొండలో క్రిస్మస్, నూతన సంవత్సర విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. అనంతరం 88 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మలావత్ మాన్సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆకుల తిర్మల్, జాగృతి రూరల్ కన్వీనర్ సాయిచరణ్, నాయకులు రాజేందర్, సంతోష్రెడ్డి, సురేందర్, మహేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, పాస్టర్లు పాల్గొన్నారు.
సిరికొండలో వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఆవిష్కరించారు. పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీలకు సంబంధించిన సిస్టమ్ను ప్రారంభించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
నిజామాబాద్ రూరల్, జనవరి 12 : నిజామాబాద్ రూరల్ మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తరఫున బీఆర్ఎస్ క్యాలెండర్ను ముద్రింపజేశారు. క్యాలెండర్లను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్లోని తన నివాసంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ముస్కె సంతోష్తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కోర్వ దేవేందర్, బీఆర్ఎస్ నాయకులు కోర్వ గంగాధర్, శ్రీనివాస్, పవన్కుమార్, గుండారం సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను రూరల్ మండల ఎంపీపీ అనూషా ప్రేమ్దాస్, జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు గురువారం కలిశారు. గ్రామాల్లోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.