డిచ్పల్లి, అక్టోబర్ 23: కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆదివారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులే నిదర్శనమన్నారు.
ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ..బాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకొని ఫలితాల్లో 65మందికి పైగా అర్హత సాధించిన యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. హైదరాబాద్లోని ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్న కూడా ఇంత పెద్ద విజయాన్ని సాధించలేమన్నారు. బాజిరెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా తమ విజయానికి కారణమైన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్, అధ్యాపకులు, పోలీసు సిబ్బందికి రుణపడిఉంటామన్నారు. ఇంతటి విజయం సాధించడానికి కోచింగ్ సెంటర్కు సహకారం అందించిన కోచింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరడి దినేశ్, టీచర్లు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, ఏడో బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ నీరడి దినేశ్, యువతీ యువకులు పాల్గొన్నారు.