ఇందల్వాయి, జూన్ 12 : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కుల సంఘాలు, ఆలయాల ప్రహరీ నిర్మాణ పనులకు ఎస్డీఎఫ్ నిధులు రూ.62.75 లక్షలు మంజూరయ్యాయి.
ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను కుల సంఘాల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్తో కలిసి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపల్లిలోని మొటాడిరెడ్డి సంఘానికి రూ.5 లక్షలు, గోసంగి సంఘానికి రూ.5 లక్షలు, ఓఆర్సీ వర్క్కు రూ.6.25 లక్షలు, మెగ్యానాయక్ తండాలో మహిళల భవనానికి రూ.2.50 లక్షలు, ఇందల్వాయి పెద్ద చెరువు మరమ్మతులకు రూ.5లక్షలు, సౌమ్యానాయక్ తండాలో కమ్యూనిటీ హాల్కు రూ.5 లక్షలు, గుడితండాలో సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రహరీకి రూ.2లక్షలు, బదావత్ సర్దార్ హౌస్కు రూ.3 లక్షలు, చంద్రాయన్పల్లిలో రామాలయ కంపౌండ్ వాల్కు రూ.3 లక్షలు, కమ్యూనిటీహాల్కు రూ.5 లక్షలు మంజూరైనట్లు వివరించారు.
అదేవిధంగా నల్లవెల్లిలో పెద్దమ్మ ఆలయానికి రూ.3 లక్షలు, గ్రామపంచాయతీ వెల్కమ్ బోర్డుకు రూ.3 లక్షలు, త్రయంబక్పేట్లో గ్రామ కమ్యూనిటీ హాల్కు రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, మండల అధ్యక్షుడు చిలివేరి దాసు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, సీనియర్ నాయకులు పాశం కుమార్, లక్ష్మారెడ్డి, మండల ప్రధానకార్యదర్శి పులి శ్రీనివాస్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పులి వసంత, సర్పంచులు, ఎంపీటీసీలు దాసు, సుధాకర్, అశ్విని, బాబూరావు, ఉపసర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డిచ్పల్లి, జూన్ 12: రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతులకు రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెపారు. ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ను ఆయన సోమవారం పరిశీలించారు. కంట్రోలర్ దేవీదాస్ను బస్టాండ్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ స్లాబ్ పెచ్చులు ఊడిపోవడాన్ని గమనించి ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవితో ఫోన్లో మాట్లాడారు. నిర్మల్ బస్సు ఇందల్వాయిలో ఆగడం లేదని స్థానికులు ఆర్టీసీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. నిర్మల్ బస్సు ఇందల్వాయి బస్టాండ్లో ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఎంకు సూచించారు. అనంతరం మండలంలోని మిట్టపల్లి సర్పంచ్ తేలు గణేశ్ అన్న ఇటీవల మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.