మోర్తాడ్/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట, ఆగస్టు 5: ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వదర కొనసాగుతున్నది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి 32,821 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,076.90 అడుగులు (37.114 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 8,900 క్యుసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ ట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) గాను, ప్రస్తుతం 1,398.37 అడుగులు (9.69 టీఎంసీల) నీరు ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న సింగీతం రిజర్వాయర్లోకి ఎగువ భాగం నుంచి 663 క్యుసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ప్రవహిస్తుండడంతో అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి పోచారం ప్రాజెక్టులోకి 3,229 క్యూసెక్కుల వరద వస్తున్నదని ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన వరద వచ్చినట్లు దిగువకు వెళ్లిపోతున్నది.